నాటక కర్త, సంఘసంస్కర్త, ప్రచురణ కర్త "కాళ్ళకూరి నారాయణరావు" గారి వర్ధంతి నేడు...

 @శ్రీనివాస్@

నాటక కర్త, సంఘసంస్కర్త, ప్రచురణ కర్త  "కాళ్ళకూరి నారాయణరావు" గారి వర్ధంతి నేడు... ఆయన గురించి కొన్ని విషయాలు..



కాళ్ళకూరి నారాయణరావు… సుప్రసిద్ధ నాటక కర్త… సంఘ సంస్కర్త… ప్రథమాంధ్ర ప్రచురణకర్త… జాతీయవాది… ఛాయా గ్రహణ వాద్యాదురంధరుడు… ‘మహాకవి’ బిరుదాంకితుడు… ఈయన తూర్పగోదావరి జిల్లాలోని కాకినాడ మత్స్యపురి గ్రామంలో 1871 ఏప్రిల్ 28న జన్మించాడు. తండ్రి బంగారురాజు, తల్లి అన్నపూర్ణమ్మ. సంఘంలో వేలూడిన పలు దురాచారాలను ఎలుగెత్తి ఖండిచారు. వీరి రచించిన నాటకాలలో చింతామణి (1921), వర విక్రయం (1923), మధుసేవ (1926) బాగా ప్రసిద్ధిచెందినవి. వీటిని చాలా మంది నాటకాలుగా ప్రదర్శించారు.తెలుగు సినిమాలుగా కూడా నిర్మించబడి మంచి విజయం సాధించాయి. వరకట్నం దురాచారాన్ని నిరసిస్తూ కాళ్లకూరి వారు రచించిన నాటకం. ఎంతో ప్రాచుర్యమున్న నాటకం. ఇది లీలాశుకుని చరిత్ర. ఆనాటి కాకినాడ వేశ్యల గుట్టుమట్లు ఆ నాటకంలో బట్టబయలు చేశాడు. ఈ నాటకం ఎన్నో సార్లు ప్రదర్శిత మైంది. ఆనాడు చింతామణిని ప్రదర్శించని నాటక పమాజమంటూలేదు. ఈ నాటకంలోని పద్యాలు ప్రజల నోటిలో తాండవించాయి. సంస్కార భారతి వారు ఈ నాటకాన్ని ఇటీవల కాలం వరకు ప్రదర్శించారు. చింతామణి నాటకం వేశ్యావృత్తికి వ్యతిరేకంగా ఉద్యమం జరుగుతున్న కాలంలో రాయబడింది. వేశ్యావృత్తిని నిరసిస్తూ కాళ్లకూరి వారి రచన ఈ నాటకం.ఈ నాటకం బహుళ ప్రాచుర్యం పొందింది. నేటికీ విజయంవంతంగా ప్రదర్సితమవుతోంది. మధుసేవ… మద్యపానం వలన కలిగే దుష్పరిణామాలను ఎత్తి చూపిన నాటకం. చిత్రాభ్యుధయం (1921), పద్మవ్యూహం (1919), సంసార నటన (1974 కళలో ధారవాహికగా ప్రచురితం) మొదలైన నాటకాలు కారణంలేని కంగారు (1920), దసరా తమాషాలు (1920), లుబ్ధగ్రేసర చక్రవర్తి (1906), రూపాయి గమ్మత్తు (1920), ఘోరకలి (1921), మునిసిపల్ ముచ్చట్లు (1921), విదూషక కపటము (1921) వంటి ప్రహసనాలు రచించాడు.

ఈయన 1927, జూన్ 27న మరణించాడు. కాళ్ళకూరి నారాయణరావు 1919లో రాసిన ‘పద్మవ్యూహం’ నాటకంలో పద్యాలతో ఉన్న సంభాషణలను పొందుపరిచారు. గుమ్మడి గోపాలకృష్ణ కూడా నారాయణరావు శిష్యుల్లో ఒకరు. డాక్టర్ కొత్తె వెంకటాచారి నారాయణరావు నాటకాల మీద పిహెచ్‌డీ చేశారు.

Comments

Popular posts from this blog

'కళాతపస్వి' కె. విశ్వనాధ్ గారికి హృదయపూర్వక జన్మదిన శూభాకాంక్షలు..

నేడు గానగంధర్వుడు స్వర్గీయ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి జయంతి..

నేడు "నందమూరి తారకరామారావు" గారి వర్ధంతి..