ప్రముఖ కవి "గుర్రం జాషువా" గారి జయంతి నేడు...
@🇸 🇷 🇪 🇪 🇳 🇮 🇻 🇦 🇸 @ 🌹✍ప్రముఖ కవి "గుర్రం జాషువా" గారి జయంతి నేడు.. ఆయన గురించి కొన్ని విషయాలు✍🌹 👉జననం : 1895 సెప్టెంబరు 28 గుంటూరు జిల్లా వినుకొండ 👉మరణం : 1971 జూలై 24 (వయసు 75) గుంటూరు 👉నివాస ప్రాంతం : గుంటూరు జిల్లా వినుకొండ 👉వృత్తి : రచయిత , కవి , సాహితీకారుడు 👉సాధించిన విజయాలు : నవయుగ కవి చక్రవర్తి 👉తండ్రి : వీరయ్య 👉తల్లి : లింగమ్మ 👉గుర్రం జాషువా జాషువా 1895, సెప్టెంబర్ 28 న వీరయ్య, లింగమ్మ దంపతులకు ఆంధ్ర ప్రదేశ్ లోని గుంటూరు జిల్లా, వినుకొండ మండలం చాట్రగడ్డపాడులో జన్మించారు. తల్లిదండ్రులు వేరువేరు కులాలకు చెందిన వారు. తండ్రి యాదవ, తల్లి మాదిగ. బాల్యం వినుకొండ గ్రామంలో పచ్చని పొలాల మధ్య హాయిగానే సాగింది. చదువుకోడానికి బడిలో చేరిన తరువాత జాషువాకు కష్టాలు మొదలయ్యాయి. ఉపాధ్యాయులు, తోటి పిల్లల నుండి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు.అయితే జాషువా ఊరుకొనేవాడు కాదు, తిరగబడేవాడు. అగ్రవర్ణాల పిల్లలు కులం పేరుతో హేళన చేస్తే, తిరగబడి వాళ్ళను కొట్టాడు. 1910లో మేరీని పెళ్ళి చేసుకున్నాడు.జాషువా కవిత్వాన్ని కాకుండా ఆయన కులాన్ని చూసి ఆయన్ని తిరస్కరించారు 19వ శతాబ్ధపు ప్రమ...