Posts

నేడు ప్రముఖ నటుడు "జగ్గయ్య" గారి జయంతి..

Image
 @శ్రీనివాస్@ నేడు ప్రముఖ నటుడు "జగ్గయ్య" గారి జయంతి.. కొంగర జగ్గయ్య (డిసెంబర్ 31, 1926 - మార్చి 5, 2004) ప్రముఖ తెలుగు సినిమా, రంగస్థల నటుడు, రచయిత, పాత్రికేయుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు మరియు ఆకాశవాణిలో తొలితరం తెలుగు వార్తల చదువరి. సినిమాలలోను, అనేక నాటకాలలోను వేసిన పాత్రల ద్వారా ఆంధ్రులకు జగ్గయ్య సుపరిచితుడు.గంభీరమైన ఆయన కంఠం కారణంగా ఆయన "కంచు కంఠం" జగ్గయ్యగా, "కళా వాచస్పతి"గా పేరుగాంచారు. నాటి మేటి నటులలో తన బహుముఖ ప్రజ్ఞతోనూ, బహు భాషాపాండిత్యంతోనూ ఆకట్టుకున్న అరుదైన నటులు కొంగర జగ్గయ్య. ఆయన పేరు వినగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది ఆయన కంచుకంఠం. ఎంతటి సుదీర్ఘ సమాసాలనైనా అలవోకగా చెప్పగల నేర్పు, ఓర్పు జగ్గయ్య గళం సొంతం. చిత్రసీమలో అడుగు పెట్టకముందు తన విద్యను ప్రదర్శించుకోవడానికి అన్నట్టు జగ్గయ్య బహుకృత వేషం కట్టారు. అందులో పాత్రికేయ వృత్తిలోనూ రాణించారు. రేడియోలో వార్తలూ చదివారు. ఆ రోజుల్లో జగ్గయ్య వార్తలు చదువుతున్నారంటే ఆ నాటి పార్కుల్లో ఉన్న రేడియోల దగ్గరకు జనం గుమి కూడేవారు. ఇప్పటికీ ఆ ముచ్చట గురించి ఆ నాటి జనం చెప్పుకుంటారు. ఇక చిత్రసీమలో జగ్...

నేడు పీపుల్స్ స్టార్ "ఆర్.నారాయణ మూర్తి" గారి పుట్టినరోజు..

Image
 @శ్రీనివాస్@ నేడు పీపుల్స్ స్టార్ "ఆర్.నారాయణ మూర్తి" గారి పుట్టినరోజు.. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలతో... R.Narayana Murthy: తెలుగు తెరకు ఆదర్శాల ఇజాన్ని అద్ది.. జీవితంలో అదే నిజమని ఎగసిపడుతున్న ‘ఎర్ర సముద్రం’! సిద్ధాంతాలు చెప్పడానికి చాలా బాగుంటాయి. వినేవారికి కూడా అబ్బో అనిపిస్తాయి. ప్రాక్టికల్ గా వాటిని ఆచరించడానికి మాత్రం వచ్చే ఇబ్బంది అంతా ఇంతా కాదు. ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళలో అధిక శాతం చెప్పేదొకటి.. చేసేదొకటి.. ఆదర్శాలు వల్లెవేస్తారు. ఆచరణలో మాత్రం వాటికి చాలా దూరం ఉంటారు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో అయితే.. తీసే సినిమాల్లో ఎన్నో ఆదర్శాలు.. అద్భుతాలు.. చితికిన జీవితాలు.. అభ్యుదయ భావాలు.. ఇలా ఎన్నైనా తెరమీద ఒలకపోసేసి.. ప్రజల నుంచి ఆహా ఓహో అనిపించుకుని కాసులు చేసుకుంటారు. తెరవెనుక మాత్రం ఒక్క ఆదర్శమూ ఆచరణలో కనిపించదు. చాలా అరుదుగా మాత్రమే ఈ రంగుల ప్రపంచంలో నేనున్నాను అంటూ దండోరా వేసుకుంటూ ఒకడు వస్తాడు. స్వతంత్ర భారతంలో ఎర్రదండును తీసుకుని రైతు రాజ్యం కోసం ఛలో అసెంబ్లీ అంటూ పీపుల్స్ వార్ కి లాల్ సలామ్ చేసి.. దానినే జీవన మార్గంగా మార్చుకుని తెర ముందూ.. వెనుకా.. ఒకేలా ఉం...

నేడు మహానటి సావిత్రమ్మా గారి వర్ధంతి..

Image
 @శ్రీనివాస్@ నేడు మహానటి సావిత్రమ్మా గారి వర్ధంతి.. సామాన్యజనం నుండి మేధావుల  వరకు ఆమె నటనకు నీరాజనాలిచ్చిన వారే... నటనలో ఉద్దండపిండాలైన నటులకే చెమటలు  పట్టించింది ఆమె... ఆమె ఎవరో కాదు మహానటి "సావిత్రి" గారు... నేడు ఆమె వర్ధంతి సందర్భంగా ఆమె స్మృతి లో కొన్ని విషయాలు.. తాను ఎవరి పక్కన హీరోయిన్‌గా  పనిచేయడానికి భయపడిందో ఆ నాగేశ్వరరావుకే నటనలో డైలాగు డెలివరిలో పాఠాలు  చెప్పే స్థాయికి చేరారు సావిత్రి గారు... నటనలో ఆమెకు ఆమే సాటి. నటనలో ఆమెతో పోటీ పడే స్థాయి తనకు కూడ లేదంటారు నాగేశ్వరరావు గారు... ఆమె అందమైన కళ్ళు కూడా అద్భుతమైన అభినయాన్ని చూపిస్తాయి. ఆమె నవ్వు పండు వెన్నెలలను కురిపిస్తాయి. ఆమె అందమైన ముఖం చంద్రబింబాన్నేతలపిస్తుంది. నటనలో తిరుగులేని మహానటి ఆమె. ఆ నటీ శిరోమణి ఎవరో కాదు మన తెలుగు ఆడ పడుచు సావిత్రి. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ సావిత్రి ఒక్కరే మహానటి. ఆమె మాత్రమే ఆ బిరుదులు, కితాబులకు సరితూనే నటీమణి అని చెప్పకతప్పదు.ఆమె ఇప్పటికీ తెలుగు తెర మీద సజీవంగానే కనీపిస్తుంది. ఎన్నో పాత్రలతో అలరిస్తుంది. సావిత్రి 1936 డిసెంబర్ 6న ఆంధ్రప్రదేశ్ లోని చిర్రావూరులో జన...

నేడు బహుముఖ ప్రజ్ఞాశాలి "భానుమతి" గారి వర్ధంతి..

Image
 @శ్రీనివాస్@ నేడు బహుముఖ ప్రజ్ఞాశాలి "భానుమతి" గారి వర్ధంతి.. మరపురాని భానుమతి! పురాణాల్లో భానుమతి అంటే దుర్యోధనుని భార్య అని తెలుస్తుంది. అయితే భారతంలో భానుమతి పాత్ర పెద్దగా కనిపించదు. కానీ, తెలుగు సినీభారతంలో మాత్రం బహుముఖ ప్రజ్ఞాశాలి అన్న మాటకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు భానుమతి. నటిగా, గాయనిగా, రచయిత్రిగా, దర్శకురాలిగా, నిర్మాతగా, స్టూడియో అధినేతగా భానుమతి సాగిన తీరు అనితరసాధ్యం అనిపించకమానదు. మొదటి నుంచీ భానుమతికి ధైర్యం పాలూ ఎక్కువే. ఎదుట ఎంతటి మేటినటులున్నా, తనదైన అభినయంతో ఇట్టే వారిని కట్టిపడేసేవారు. ఇక ప్రతిభ ఎక్కడ ఉన్నా పట్టుకొని వచ్చి పట్టం కట్టడం కూడా ఆమెకు వెన్నతో పెట్టిన విద్య అనే చెప్పాలి. ఈ నాటి ప్రకాశం జిల్లా దొడ్డవరంలో 1925 సెప్టెంబర్ 7న భానుమతి జన్మించారు. బాల్యం నుంచీ భానుమతి చాలా చురుగ్గా ఉండేవారు. ఇట్టే పద్యగద్యాలను అప్పచెప్పేవారు. ప్రౌఢకావ్యాలనైనా అవలీలగా వల్లించేవారు. ఇక చిన్నతనంలోనే సొంతగా రచనలు కూడా చేసేవారు. అందుకు కారణం ఆమె తండ్రి బొమ్మరాజు వెంకటసుబ్బయ్య అనే చెప్పాలి. “కంటే కూతుర్నే కనాలిరా… మనసుంటే మగాడిలా పెంచాలిరా…” అంటూ ఈ నాడు పాటలు పాడుకో...

నేడు అమర గాయకుడు మహ్మద్ రఫీ గారి జయంతి…

Image
 నేడు అమర గాయకుడు మహ్మద్ రఫీ గారి జయంతి…     ‘ఏ దునియా ఏ మహెఫిల్ మేరే కామ్ కీ నహీ..’ ‘సుహానీ రాత్ ఢల్ చుకీ.. నాజానే తుమ్ కబ్ ఆవోగీ..’ వంటి మధురుమైన పాటలు.. సుమధుర గానం వినగానే గుర్తుకు వచ్చే పేరు  కీ.శే. మహ్మద్ రఫీ. బాలీవుడ్ ప్రముఖ పేర్లలో ఈయన పేరు వుంటుంది. తెలుగులో కూడా తన గాన మాధుర్యంతో సంగీత ప్రియులను అలరించారు ఆ మహా గాయకుడు. ‘నేడే తెలిసింది.. ఈనాడే తెలిసింది’ వంటి ప్రజాదరణ పొందిన తెలుగు పాటలు పాడారు రఫీ. ఆయన గానానికి దేశంలోని అన్నీ భాషల్లో అభిమానులు వున్నారు. తెలుగు, హిందీ, ఉర్దూ వంటి 17 భాషల్లో ఆయన పాటలు పాడారు. ఇప్పటికీ ఆయన పాటలు రేడియోలో కమ్మగా పలకరిస్తాయి. 1950 నుంచి 1970 మధ్యకాలం మహ్మద్ రఫీ కాలం అని చెప్పొచ్చు. ఆయన లేకపోయినా ఆయన పాటలు అజరామరంగా నిలిచిపోతాయి. రఫీకి ముందు, తరువాత ఎందరు గాయకులు ఉన్నా, వచ్చినా ఆయన గాత్రంలోని మాధుర్యం ఆకట్టుకున్న తీరేవేరు. ఆయన పాటకు ఫిదా కానివారు లేరు. అలాంటి మహా గాయకుడి పుట్టినరోజు నేడు. 24 డిసెంబర్ 1924లో పంజాబ్‌లోని కోట్లా సుల్తాన్ పూర్‌లో జన్మించారు ఆయన. 31 జూలై 1980 లో మరణించారు.ఆయన తెలుగులో పాడిన సినిమాలు.. భక్త రామదాసు, భ...