Posts

నేడు దర్శకులు కమలాకర కామేశ్వరరావు గారి వర్ధంతి..

Image
@శ్రీనివాస్@ గుండమ్మ కథ,బాల భారతం, నర్తనశాల,పాండవ వనవాసం లాంటి అపురూప చిత్రాల దర్శకులు "కమలాకర కామేశ్వరరావు" గారి వర్ధంతి నేడు... ఆయన గురించి కొన్ని విషయాలు.. కమలాకర కామేశ్వరరావు 1911, అక్టోబర్ 4 న బందరులో జన్మించాడు. ఆయన విద్యాభ్యాసం పూర్తిగా అక్కడే జరిగింది. ఆయన 1933లో బి.ఏ. పాసయాడు. అప్పటికే ఆయనకు సినిమా టెక్నిక్ మీద మంచి ఉత్సాహం ఏర్పడింది. వచ్చిన ప్రతి చిత్రమూ భాషతో నిమిత్తం లేకుండా తప్పక చూసేవాడు. చూసి ఊరుకోక ఫిల్మ్ టెక్నిక్ కు సంబంధించిన పుస్తకాలు తెప్పించి చదవడం ప్రారంభించాడు. స్వతహాగా ఉన్న ఆసక్తికి ఇలా పుస్తకాల ద్వారా పొందిన విజ్ఞానం తోడవడంతో ఆయన విడుదలైన సినిమాల మీద విమర్శలు వ్రాయడం ఆరంభించాడు. కృష్ణా పత్రికలో 'సినీఫాన్' అన్న పేరుతో సినిమా రివ్యూలు వ్రాసే వాడు. విడుదలైన తెలుగు సినిమాలను; న్యూ థియేటర్స్, ప్రభాత్ వారి హిందీ సినిమాలనూ కూలంకషంగా పరిశీలిస్తూ నిశితంగా విమర్శించేవాడు. బందరులో మొదటిసారి విడుదల కాని సినిమాలను బెజవాడ వెళ్ళి చూసి వచ్చేవాడు. సినిమాల్లో కథ, కథాసంవిధానం ఎలా వున్నాయి? ఆ సినిమాలు టెక్నికల్ గా ఎలా వున్నాయి? అన్న విషయాల మీద ఆయన విమర్శలు సాగేవి...

వాస్తవికతకు అద్దంపట్టే రచనలు చేసిన ప్రముఖ రచయిత్రి "అబ్బూరి ఛాయాదేవి" గారి వర్ధంతి నేడు...

Image
 @శ్రీనివాస్@ వాస్తవికతకు అద్దంపట్టే రచనలు చేసిన ప్రముఖ రచయిత్రి "అబ్బూరి ఛాయాదేవి" గారి వర్ధంతి నేడు... 1933 అక్టోబర్ 13న రాజమండ్రిలో సాంప్రదాయ కుటుంబంలో జన్మించారు.  ఆ రోజుల్ని బట్టి ఆడపిల్లలకి పెద్ద చదువులు చెప్పించడం ముఖ్యం కాదు పెళ్ళి తొందరగా చేసెయ్యాలి అన్న పద్ధతి పాటించారు ఆమె తరపు పెద్దలు. ప్రసిద్ధ సాహితీవేత్త అబ్బూరి రామకృష్ణరావుగారి కోడలిగా ప్రసిద్ధ రచయిత విమర్శకులు అయిన అబ్బూరి వరద రాజేశ్వరరావు గారి సతీమణిగా సంసారజీవితంలో అడుగు పెట్టారు ఛాయాదేవి గారు. రాజేశ్వరరావుగారితో సాహితీచర్చలు జరిపేందుకు ప్రముఖ కవులు రచయితలు వారి ఇంటికి వచ్చేవారుట. స్వతహాగా ఆమెకు కూడా సాహిత్యం పట్ల చాలా ఆసక్తి ఉండడం వలన ఆమె కూడా ఆ చర్చల్లో పాల్గొనేవారుట. మధ్యతరగతి మహిళల జీవితాల్లోని ఆటుపోట్లను అక్షరీకరించిన ప్రముఖ రచయిత్రి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఆవిడ.. ఛాయాదేవి డెభ్భైకుపైగా కథలు, యాత్రారచనలు, సాహిత్య వ్యాసాలు, నవలలు రచించారు. కుటుంబంలో ఆడపిల్లలు ఎదుర్కొనే వివక్షను ఎత్తిచూపుతూ ఆమె రాసిన ‘బోన్సాయ్‌ బ్రతుకు’ కథను 2000వ సంవ్సతరంలో పదవ తరగతి తెలుగు వాచకంలో పాఠ్యాంశంగా బోధించడం విశేష...

సుప్రసిద్ధ రచయిత,తెలుగు వారందరికీ సుపరిచితులు "ముళ్లపూడి వెంకటరమణ" గారి జయంతి నేడు...

Image
 @శ్రీనివాస్@ సుప్రసిద్ధ రచయిత,తెలుగు వారందరికీ సుపరిచితులు "ముళ్లపూడి వెంకటరమణ" గారి జయంతి నేడు... ఆయన గురించి కొన్ని విషయాలు.. ముళ్ళపూడి వెంకటరమణ (జూన్ 28, 1931 - ఫిబ్రవరి 24, 2011) ఒక తెలుగు రచయిత. తెలుగు నవలలు, కథలు, సినిమా కథలు, హాస్య కథలు వ్రాశాడు. ముఖ్యంగా తన హాస్యరచనలకు ప్రసిద్ధుడయ్యాడు. ఇతను వ్రాసిన పిల్లల పుస్తకం బుడుగు తెలుగు సాహిత్యంలో ఒక విశిష్టమైన స్థానం కలిగి ఉంది. ప్రఖ్యాత చిత్రకారుడైన బాపు కృషిలో సహచరుడైనందున వీరిని బాపు-రమణ జంటగా పేర్కొంటారు. ఆయన ఆత్మకథ కోతి కొమ్మచ్చి అనే పుస్తక రూపంలో వెలువడింది. ముళ్లపూడి వెంకటరమణ 1931లో ధవళేశ్వరంలో జన్మించారు. ఊహ తెలిసీ తెలియని వయసులోనే తండ్రిని కోల్పోయారాయన. ధవళేశ్వరం ఆనకట్టలో తండ్రి క్యాష్‌ కీపర్‌. తండ్రి గతించాక, ఉదరపోషణార్థం తల్లి ధవళేశ్వరం నుంచి మద్రాసు మహానగరానికి మకాం మార్చారు. అక్కడ ఒక ఇంటిలో మెట్ల కింద చిన్న గదిలో అద్దెకు నివాసం ఏర్పాటుచేసుకున్నారు. తల్లి విస్తరాకులు (అడ్డాకులు) కుట్టి కిరాణా దుకాణానికి అమ్మిన రోజులు, ప్రింటింగ్‌ ప్రెస్‌లో కంపోజింగ్‌ చేసిన రోజులు ఉన్నాయి. ‘మా అమ్మ నాకు జన్మరీత్యా అమ్మ. జీవితం రీత...

నటి, దర్శకురాలు "విజయనిర్మల" గారి వర్ధంతి..

Image
 @శ్రీనివాస్@ నటి, దర్శకురాలు "విజయనిర్మల" గారి వర్ధంతి.. ఆమె గురించి కొన్ని విషయాలు.. విజయనిర్మల (ఫిబ్రవరి 20, 1946 - జూన్ 27, 2019) తెలుగు సినిమా నటి, దర్శకురాలు, సినీ నటుడు ఘట్టమనేని కృష్ణ భార్య. ఈమె సినీ నటుడు నరేష్ కి తల్లి, నటి జయసుధకు ఈమె పిన్నమ్మ. విజయనిర్మల పుట్టిల్లు నరసరావుపేట. విజయనిర్మల తల్లి శకుంతల, అన్నలు వసంతరావు, సంజీవరావు పాతూరులో వీరి కుటుంబాలన్నీ ఉండేవి. విజయనిర్మల బాల్యం అత్యధిక కాలం పాతూరులోనే గడిచింది. రాజాగారి కోటలోని విక్టోరియా హాల్లో ఆమె చిన్నతనంలో నృత్య ప్రదర్శన కూడా ఇచ్చింది. తదనంతర కాలంలో విజయనిర్మల తల్లిదండ్రులతో కలిసి చెన్నై వెళ్లిపోయారు.ఈమె అసలు పేరు నిర్మల అయితే తనకు సినీరంగములో తొలి అవకాశమిచ్చిన విజయా స్టూడియోకు కృతజ్ఞతగా విజయనిర్మల అని పేరు మార్చుకొన్నది. అప్పటికే ఇదే పేరుతో వేరే నటి (ఇప్పటి నిర్మలమ్మ) ఉండడం కూడా పేరు మార్పునకు మరో కారణము. పాండురంగ మహత్యంలో బాలనటిగా చిత్రరంగంలో ప్రవేశించారు. ఆ తరువాత అంచెలంచెలుగా ఎదిగి కథానాయకిగా ఉన్నతస్థానానికి చేరారు. తరువాత దర్శకత్వ బాధ్యతలు చేపట్టి ప్రపంచంలోనే అత్యధిక సినిమాలకు దర్శకత్వం వహించిన మహిళగా 2...

నాటక కర్త, సంఘసంస్కర్త, ప్రచురణ కర్త "కాళ్ళకూరి నారాయణరావు" గారి వర్ధంతి నేడు...

Image
 @శ్రీనివాస్@ నాటక కర్త, సంఘసంస్కర్త, ప్రచురణ కర్త  "కాళ్ళకూరి నారాయణరావు" గారి వర్ధంతి నేడు... ఆయన గురించి కొన్ని విషయాలు.. కాళ్ళకూరి నారాయణరావు… సుప్రసిద్ధ నాటక కర్త… సంఘ సంస్కర్త… ప్రథమాంధ్ర ప్రచురణకర్త… జాతీయవాది… ఛాయా గ్రహణ వాద్యాదురంధరుడు… ‘మహాకవి’ బిరుదాంకితుడు… ఈయన తూర్పగోదావరి జిల్లాలోని కాకినాడ మత్స్యపురి గ్రామంలో 1871 ఏప్రిల్ 28న జన్మించాడు. తండ్రి బంగారురాజు, తల్లి అన్నపూర్ణమ్మ. సంఘంలో వేలూడిన పలు దురాచారాలను ఎలుగెత్తి ఖండిచారు. వీరి రచించిన నాటకాలలో చింతామణి (1921), వర విక్రయం (1923), మధుసేవ (1926) బాగా ప్రసిద్ధిచెందినవి. వీటిని చాలా మంది నాటకాలుగా ప్రదర్శించారు.తెలుగు సినిమాలుగా కూడా నిర్మించబడి మంచి విజయం సాధించాయి. వరకట్నం దురాచారాన్ని నిరసిస్తూ కాళ్లకూరి వారు రచించిన నాటకం. ఎంతో ప్రాచుర్యమున్న నాటకం. ఇది లీలాశుకుని చరిత్ర. ఆనాటి కాకినాడ వేశ్యల గుట్టుమట్లు ఆ నాటకంలో బట్టబయలు చేశాడు. ఈ నాటకం ఎన్నో సార్లు ప్రదర్శిత మైంది. ఆనాడు చింతామణిని ప్రదర్శించని నాటక పమాజమంటూలేదు. ఈ నాటకంలోని పద్యాలు ప్రజల నోటిలో తాండవించాయి. సంస్కార భారతి వారు ఈ నాటకాన్ని ఇటీవల కాలం వరకు ...